Friday, 03 April 2026 01:52:49 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మీ సేవ’ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఛార్జీల పెంపు అమలు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 02 April 2026 05:33 PM Views : 20

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : ‘ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/2 ఏప్రిల్/ అక్షరం న్యూస్ : జిల్లాలో సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ‘మీ సేవ’ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుంచి ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 8:00 గంటల వరకు సర్వర్ నిర్వహణ పనులు కొనసాగనున్నట్లు వెల్లడించారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్‌గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం ఈ నిర్వహణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కాలంలో సంబంధిత విభాగాలకు చెందిన అన్ని ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు. భవిష్యత్తులో వేగవంతమైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ చర్యలు ఉపయుక్తమవుతాయని పేర్కొన్నారు. ఇక ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా అందించే వివిధ ధ్రువపత్రాలు మరియు ఇతర సేవలకు సంబంధించిన సేవా ఛార్జీలను ప్రభుత్వం సవరించినట్లు తెలిపారు. సవరించిన ఛార్జీలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు రూ.35గా ఉన్న కనీస సేవా ఛార్జీని రూ.62కు పెంచినట్లు తెలిపారు. ‘ఏ’ కేటగిరీ సేవలకు రూ.62 చొప్పున, ‘బీ’ కేటగిరీ సేవలకు రూ.80 చొప్పున ఛార్జీలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అదనంగా కరెంటు బిల్లులు, ఈ-పాస్ సేవలు, బయోమెట్రిక్ సేవలు, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలకు కూడా సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు.ప్రజలు ఈ మార్పులను గమనించి సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :