AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 10 తల్లాడ (అక్షరంన్యూస్) తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం లయన్స్ క్లబ్ సభ్యుడు సింగిరికొండ సతీష్ పాప సహస్ర 12వ జన్మదిన సందర్భంగా స్థానిక బస్టాండ్ లోని ప్రయాణికులు మరియు పేదలకు ఆహార పొట్లాలు సుమారు 50 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగరి కొండ సతీష్ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలోనే నిజమైనఆనందం ఉన్నదని అన్నారు. లైన్స్ క్లబ్ సభ్యులు ప్రయాణికులు సహస్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావు మరియు జోన్ చైర్మన్ బెల్లంకొండ ఆంజనేయులు మరియు , మరియు లైన్స్ క్లబ్ సభ్యులుశీలం వెంకటరెడ్డి , కటికి వెంకటేశ్వర్లు, యాచవరపు వెంకటరెడ్డి, వెచ్చా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily