D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/ ఫిబ్రవరి 10 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామంలో మంగళవారం బ్యాంక్ అప్డేషన్, రియాక్టివేషన్, కేవైసీలపై ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ. శ్రీధర్ రాజు సర్పంచ్ కటిక కిరణ్ కుమార్ వారు మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కౌన్సిలర్ శ్రీనివాస్ రావు, నాగరాణి, సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ కేవైసీ ఆర్ ఈ కేవైసీ సికేవైసీ ఈ కేవైసీలు అకౌంట్ అప్డేషన్ చేసుకోవాలని మరియు ఖాతాదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ధనవంత్రి జీవన్ జ్యోతి సురక్ష బీమా యోజన సుకన్య సమృద్ధి యోజన అటల్ పెన్షన్ యోజన రూపే కార్డుల గురించి అవగాహన కల్పించారు, ఇన్సూరెన్స్ చేయడం ద్వారా ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా 10 లక్షలు వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, పంచాయతి కార్యదర్శి ఎస్.కె సిద్ధిక్ మియా, ఉపసర్పంచ్ యశోద, వార్డుసభ్యులు, అంగన్వాడి టీచర్లు ఆశా కార్యకర్తలు, బ్యాంకు కౌన్సిలర్లు ఖాతాదారులు పాల్గొన్నారు .
.
Aksharam Telugu Daily