GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : . హుస్నాబాద్/సిద్దిపేట (అక్షరం న్యూస్) సెప్టెంబర్ 18 కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా,తన తల్లి గారి ఇంటి వద్ద ఉంటున్న మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తి పై హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..హుస్నాబాద్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వివాహిత మహిళ కుటుంబ కలహాలతో భర్తకు దూరమై తల్లిదండ్రులకు భారంగా ఉండలేక ఉపాధి కోసం వెతుక్కుంటుంటే తన అవసరాన్ని ఆసరాగా చేసుకున్న హుస్నాబాద్ కు చెందిన నిందితుడు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గడిపె మల్లేష్ నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఇరవై వేలు అడగగా నమ్మిన బాదిత మహిళ రూ 15 వేలు ఇచ్చిందని అయితే డబ్బులు తీసుకున్న కొద్ది రోజులు పని ఐపోతుంది అని నమ్మబలికి, గత సంవత్సరం నుండి అసలు ఫోన్ స్పందించక పోగా కనిపిస్తే చూసి చూడనట్లు వెల్లిపోతున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..గడిపే మల్లేష్ గతంలో కూడా నిజాయితీ పరుడైన ప్రభుత్వ ఉద్యోగిని డబ్బుల కోసం వేధిస్తే ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆ బాధ భరించలేక 2 ఏళ్ల సర్వీస్ ను వదులుకుని రిటైర్మెంట్ తీసుకున్నడని,సీపీఐ పార్టీకి చెందిన ఒక జాతీయ నేత తన వెనక ఉన్నడన్న అండతో అనేక అక్రమాలకు,బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని,తను చెప్పినట్లు వినకుంటే ఉద్యోగం తీపిస్తానని ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండేంట్ పై పలుమార్లు నీరాధారామైన ఆరోపణలు చేశాడని,హుస్నాబాద్ పట్టణంలో ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటుంటే నిబంధనలు పాటించడం లేదని మున్సిపల్ అధికారులకు పిర్యాదులు చేసి స్టేట్మెంట్ లు ఇచ్చి మళ్ళీ వారితో సెటిల్మెంట్లు చేసుకుని డబ్బులు వసూలు చేసేవాడని,పేద ప్రజలు ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లు కట్టుకుంటే తన అనుచరులతో దౌర్జన్యంగా నిర్మాణాల దగ్గరికి వెళ్లి అడ్డంకులు సృష్టించాడని,గడిపే మల్లేష్ పై ఫిర్యాదు చేసే బాధితులు జాతీయ నేత దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్న కూడా ఎలాంటి ప్రయోజనం లేదని,గడిపే మల్లేష్ తీరు వల్ల పార్టీ నష్టపోతుందని పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు బాధపడుతున్నట్టు తెలుస్తోంది.. ఆయన బాధితులు ఇంకా ఉన్నారని,ప్రజల కోసం పని చేసే సీపీఐ నాయకుడు ప్రజలను ఇబ్బంది పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..ఇదంతా జరుగుతున్న కూడా సీపీఐ పార్టీ నుండి ఎలాంటి స్పందన ఉంటుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు..
.
Aksharam Telugu Daily