P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల జులై పెద్దపల్లి 27 అక్షరం న్యూస్ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు 679 జీవో నెంబర్ తీసుకురావడం చాలా గొప్ప విషయమని ఈ జీవో తీసుకువచ్చినందుకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక అభినందనలు పేర్కొన్నారు ఈ సందర్భంగా గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఓదెల మండల కేంద్రంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 679 జీవో నెంబర్ ఉద్యమకారులను గుర్తించడానికి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆరుగురు సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేసి కమిటీ సభ్యుల తోటి కలిసి సెక్రెటరీ అమరవీరుల జ్యోతిభవన్లో జర్నలిస్టుల అమరవీరుల కుటుంబాలు మహిళలు విద్యార్థులతోటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులు కవులు కళాకారులతోటి అందరితోటి సమావేశాలు ఏర్పాటు చేసి అందరి దగ్గర అభిప్రాయాలు సేకరణ తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందుకు కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు అప్పటి మేనిఫెస్టో ఎన్నికల కమిటీ చైర్మన్ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కృషి మరువలేనిది ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామరావు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ వీళ్ళందరూ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి కాలయాపన లేకుండా వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాను హైదరాబాద్ నగరంలోని 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి పది లక్షల రూపాయలు 25 వేల పెన్షన్ హెల్త్ కార్డ్ ఉద్యమకారుల పిల్లలు విదేశాలకు చదువుకోవడానికి వెళ్లడం కోసం ప్రభుత్వం ఖర్చు భరించాలని బస్సు పాస్ రైలు పాస్ అన్ని సంక్షేమ పథకాలలో చతిస్గడ్ ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఇస్తున్న విధంగా అమలు చేయాలని ప్రజా ప్రతినిధులు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ జర్నలిస్టుల ఫోరం కోఆర్డినేటర్ చర్లపల్లి సురేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు పలకల నరసింహారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కందుల అశోక్ పటేల్ జిల్లా కార్యదర్శి తోట్ల రాములు ఓదెల మాజీ మండల అధ్యక్షులు పెండెం కొమురయ్య పల్కపాటి సదానందం రాచర్ల ఓదెలు గుగులోత్ పరశ నాయక్ కరక మోహన్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily