Friday, 14 November 2025 02:34:02 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు పిలుపు మేరకు మెమోరాండం ఇచ్చిన రేషన్ డీలర్లు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 25 August 2025 07:33 PM Views : 383

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు, అక్షరం న్యూస్ /ఆగస్టు 25: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కొరకు , రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ విడుదల కొరకు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ అధ్యక్షుడు నాయకోటి రాజు పిలుపు మేరకు సోమవారం బూర్గంపాడు మండల రేషన్ డీలర్స్ అధ్యక్షుడు బాణోతు రెడ్యా నాయక్, కార్యదర్శి బాణోతు బాలాజీ ఆధ్వర్యంలో బూర్గంపాడు ఉపతహశీల్దార్ పీ. సమ్మయ్య కు మెమోరండం అందించారు. అనంతరం అధ్యక్షుడు రెడ్యా నాయక్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా ఒక నెల లేద రెండు నెలలు జీతం రాకపోతే కుటుంబ పోషణ ఎంత ఇబ్బంది గా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. అలాంటిది ఐదు నెలలుగా కమీషన్ రాకపోవడంతో డీలర్లు అప్పులపాలై జీవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జూన్,జులై, ఆగస్టు మూడు మాసాల కు కలిపి ఒకేసారి బియ్యం పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది, అయినా ఎన్నో వ్యయప్రయాసాలనోర్చి ఉదయం 7 గంటల మొదలు రాత్రి 10 గంటల వరకు బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆదేశానుసారం ఏ పనికైన సిధ్ధంగా ఉన్నా డీలర్ల సమస్యలు తీర్చకపోవడం సమంజసం కాదని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కమీషన్ పెంపుపై అనేక సార్లు ప్రభుత్వం కు వినతులు ఇవ్వడం, నిరసనలు తెలియజేయడం పరిపాటిగా మారింది. అయినా కూడా డీలర్ల పై ప్రభుత్వం సీతకన్ను వేయడం బాధాకరమని అన్నారు. డీలర్ల కు వచ్చేదే నామమాత్రపు కమీషన్ అది కూడా రెగ్యులర్ గా రాకపోతే ఎలా బ్రతకాలని అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సమస్య. ఇప్పటికైన ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనుకాడబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ హుస్సేన్ డీలర్లు వెంకటశ్వర్లు, రమేష్, శ్రీను, కే.క్రష్ణాచారి తదితరులు పాల్గొన్నారు..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :