GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/అక్టోబర్-09(అక్షరం న్యూస్) ప్రమాదం గురైన కారు కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించిన సంఘటన ముస్తాబాద్ మండలం లో చోటు చేసుకుంది.ముస్తాబాద్ మండల కేంద్రం లో వెంకటేశ్వర స్వామి గుట్ట మార్గం లో బుధవారం కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది ఈ ఘటనలో ముస్తాబాద్ కు చెందిన డి మనోజ్ కుమార్ ఏ సతీష్ లు తీవ్రంగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు వీరిని అదే రాత్రి 108 లో సిద్దిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న కారు కాలి పోయి ఉండడంతో చర్చనీ అంశంగా మారింది కారు ప్రమాద స్థలంలోనే గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
.
Aksharam Telugu Daily