GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్/హుజురాబాద్/జనవరి 19/అక్షరం న్యూస్: ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో పత్రికలవి పత్రికలవి కీలకపాత్ర అని హుజురాబాద్ ఏసిపి వి మాధవి అన్నారు. సోమవారం రోజున అక్షరం దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఎసిపి మాధవి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారులు అందించిన సమాచారాన్ని పత్రికల్లో ప్రచురించి ప్రజలను చైతన్య పరచడంలో అక్షరం పత్రిక కీలక భూమిక పోషిస్తుందని ఏసిపి మాధవి అన్నారు. గ్రామాలలో ప్రజలు అవగాహన రాహిత్యంతో సైబర్ నేరాలకు బలి అవుతున్నారని సైబర్ నేరగాళ్ల అట్లా ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా అధికారుల సూచనలను ప్రజలకు తెలిసే విధంగా పత్రికలు సహకరించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ అక్షరం దినపత్రిక ఆర్ సి ఇంచార్జ్ సౌడమల్ల యోహాన్, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ నాయకులు ఎండి కాజా ఖాన్, డివిజన్ నాయకులు కందుకూరి రాజు, రచ్చ రవికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily