Sunday, 06 September 2026 02:55:35 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎస్సీ వర్గీకరణతో సమానత్వానికి బాట

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 06 September 2026 11:46 AM Views : 25

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట్/నేరేడుచర్ల : సూర్యాపేట /నేరేడుచర్ల,చిల్లపల్లి,సెప్టెంబర్ 06: అక్షరం న్యూస్ నవ సమాజ నిర్మాత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు నేరేడుచర్ల మండలం చిల్లపల్లి గ్రామంలో ఆదివారం ఎంఎస్పీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నేరేడుచర్ల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యడవల్లి అరుణ్ మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యడవల్లి అరుణ్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనతో దళిత సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన అసమానతలు క్రమంగా తొలగిపోతున్నాయని అన్నారు. ఇప్పటివరకు అవకాశాలకు నోచుకోని మాల, మాదిగ తదితర ఎస్సీ ఉపకులాలకు వర్గీకరణ ద్వారా విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ దళిత సమాజంలో సమానత్వ సాధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. నూతన కమిటీ: ఎంఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మాతంగి బిక్షం మాదిగ, అధికార ప్రతినిధిగా కడప ప్రసాద్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పాతకోటి గంగరాజు మాదిగ, కార్యదర్శిగా పరంగి మైసయ్య మాదిగ, ఉపాధ్యక్షులుగా నన్నెపంగా బంగారు మాదిగ, కార్యదర్శిగా మాతంగి సైదులు మాదిగ, ప్రచార కార్యదర్శిగా నన్నెపంగా ముసలయ్య మాదిగ, సహాయ కార్యదర్శిగా పాతకోటి రామయ్య మాదిగ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మాతంగి సైదులు, ఇరుగు రవి, మాతంగి సన్నీ, బట్టు సైదులు, ఇరుగు లింగయ్య, నన్నెపంగా కిరణ్, నన్నెపంగా గిరి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పలువురు ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :