Monday, 30 March 2026 04:32:32 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పర్యావరణ పరిరక్షణ వాతావరణ మార్పుల పై అవగాహన కార్యక్రమం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 30 March 2026 12:09 PM Views : 13

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : . కాల్వ శ్రీరాంపూర్ / మార్చి 29 / అక్షరం న్యూస్:మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా నవ క్రాంతి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఇండియా నవ క్రాంతి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ పర్యావరణం పరిరక్షణ కోసం మరియు గ్రామీణ ప్రాంతాలలో రైతులతో సేంద్రియ వ్యవసాయం కోసం రిజనరేటివ్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తుందని రైతులకు భూమి కాలుష్యం,నీటి కాలుష్యం గాలి కాలుష్య నివారణ పైన అదే విధంగా పురుగుమందుల నిషేధం కోసం మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని కాల్వశ్రీరాంపూర్ R.A. ప్రాజెక్టు మేనేజర్ T. సతీష్ కుమార్ పేర్కొనడం జరిగింది ఇందులో భాగంగా మార్చి చివరి శనివారం ప్రతి సంవత్సరం ఎర్త్ అవర్ అనే ప్రోగ్రాం ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మార్చి 28 శనివారం రోజు వసతి గృహంలో మరియు పరిసర ప్రాంతాల్లో గంటపాటు విద్యుత్ ఆఫ్ చేయడం జరిగింది ఇలా చేయడం వల్ల విద్యుత్ ఆదా అవడం మరియు పర్యావరణంలో ఉష్ణోగ్రత తగ్గి వాతావరణం చల్లబడుతుందని వారు పేర్కొనడం జరిగింది అదేవిధంగా వసతిగృహంలోని విద్యార్థులకు పర్యావరణంపై పరీక్ష నిర్వహించి గెలుపొందిన వారికి ప్రథమ,ద్వితీయ బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ బంగారి రమేష్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ పాల్గొని పర్యావరణం గురించి మాట్లాడడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి W.W.F. INDIA నవ క్రాంతి F.P.C.L R.A ప్రాజెక్టు మరింత ముందుకు వెళ్లాలని వారు తెలిపారు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలకు మేము కూడా ముందుండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నవ క్రాంతి R.A. ప్రాజెక్ట్ మేనేజర్ T.సతీష్ కుమార్ F.P.C.L సిబ్బంది, వసతి గృహం సిబ్బంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :