Monday, 19 May 2025 11:25:26 PM

మహనీయులు అంబేద్కర్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహన్ని ప్రారంభించిన టిజిఐడిసి చైర్మన్ విజయబాబు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 15 April 2025 03:07 PM Views : 282

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ ఏప్రిల్ 14 (అక్షరంన్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికే మార్గదర్శకుడుగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర ఐ డి సి చైర్మన్ మువ్వా విజయ్ బాబు అన్నారు. సోమవారం కామేపల్లి మండలం లోనీ పెంజరమడుగు గ్రామంలో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మువ్వా విజయబాబు ఈ మాట్లాడుతూ ఆయన రాసిన రాజ్యాంగం మన దేశానికి ఒక దిశానిర్దేశం అయింది అని, ఆయన కలలు కన్న సమాజాన్ని నిర్మించడమే మనందరి లక్ష్యం అని పిలుపునిచ్చారు. ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం వల్లే ఈనాడు వ్యవస్థలన్నీ ఆ రాజ్యాంగానికి లోబడి నడుస్తున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ న్యాయం సమానత్వం హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ మార్గదర్శనాన్ని అనుసరిస్తూ పని చేస్తోందని, దేశ ప్రజల హక్కులను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ ఫార్మర్ హెర్ ఫర్ కమిషనర్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చరణ్ రెడ్డి, కామేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :