P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : * * ఓదెల/ పెద్దపల్లి జూన్ 23 (అక్షరం న్యూస్) విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ, రమేష్ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా Heal your mind &plant a tree say no drugs అనే నినాదం తో సోమవారం పొత్కపల్లి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ,, గంజాయి మత్తుపదార్థాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన మరియు పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ,, విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. మీ చుట్టూ ప్రక్కల ప్రాంతం లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీస్ దృష్టికి తీసుకురావాలన్నారు. సమాచారం అందించిన వివరణ గోపిగా ఉంచబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ, రమేష్ ఏఎస్ఐ లక్ష్మీరాజం, రైటర్ కె, రాజు, కానిస్టేబుల్స్ రాజేందర్, శివ శివ శంకర్,రాము, రజిత, ధనలక్ష్మి, ఉపాధ్యాయులు అమృత కిషోర్,ఇట్టం శ్రీనివాస్, హరికృష్ణ,రవి, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily