D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 29(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని ఇందిరమ్మ ఇండ్లతో నిలువ నీడలేని నిరుపేదలకు శాశ్వతంగా నిలువ నీడ కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 3,500 చొప్పున మంజూరు చేస్తున్నారని, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనమని మహబూబాబాద్ జిల్లా గంగారం మండల మాజీ జడ్పిటీసి రమ సురేష్ అన్నారు. నేడు గంగారం మండలం చింత గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన ఈ సందర్భంగా మాజీ జడ్పిటీసి రమ సురేష్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి ఈసం అశోక్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి, మాట తప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అలాకాకుండా ఇచ్చిన హామీ మేరకు నిలువ నీడలేని పేదలకు 5 లక్షల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో దశలవారీగా ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి సరైన విధంగా లేనప్పటికీ, పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. లబ్దిదారులు ప్రభుత్వం, అధికారులు సూచించిన, నిర్దేశించిన విధంగా ఇల్లు కట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily