Monday, 12 January 2026 11:06:27 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదలకు శాశ్వత నిలువ నీడ.. *గంగారం మండల మాజీ జడ్పిటీసి ఈసం రమ సురేష్ *

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 29 July 2025 02:53 PM Views : 573

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 29(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని ఇందిరమ్మ ఇండ్లతో నిలువ నీడలేని నిరుపేదలకు శాశ్వతంగా నిలువ నీడ కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 3,500 చొప్పున మంజూరు చేస్తున్నారని, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనమని మహబూబాబాద్ జిల్లా గంగారం మండల మాజీ జడ్పిటీసి రమ సురేష్ అన్నారు. నేడు గంగారం మండలం చింత గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన ఈ సందర్భంగా మాజీ జడ్పిటీసి రమ సురేష్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి ఈసం అశోక్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి, మాట తప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అలాకాకుండా ఇచ్చిన హామీ మేరకు నిలువ నీడలేని పేదలకు 5 లక్షల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో దశలవారీగా ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి సరైన విధంగా లేనప్పటికీ, పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. లబ్దిదారులు ప్రభుత్వం, అధికారులు సూచించిన, నిర్దేశించిన విధంగా ఇల్లు కట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :