AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు మండలం/ సారపాక. అక్షరం న్యూస్/ ఆగస్టు 2: ఎస్బిఐ లైఫ్ బి సి ఎం బ్రాంచ్ క్వార్టర్లీ నిర్వహించు సమావేశం నందు అత్యధిక ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు అందించే ప్రతిభా పురస్కారాన్ని వరుసగా మూడవసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా డివిజనల్ మేనేజర్ కురుమల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సారపాక గ్రామానికి చెందిన సిహెచ్ రమాదేవి అందించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కురుమల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ లో 70 శాతం మంది మహిళలు రాణిస్తున్నారు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ మరియు అడ్వైజర్ గా చేరడం వలన ప్రతి నెల 30 వేల నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తూ ఐదు సంవత్సరాల తర్వాత పనిచేయకపోయినా జీవితాంతం మంచి ఆదాయాన్ని పొందుతూ ఒక పెన్షనర్ గా జీవించే అవకాశం ఉందని ఉచిత బీమా సదుపాయం ఉంటుందని ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని ఆసక్తిగల 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైనా సరే మీకు వినే ఓపిక నేర్చుకోవాలని ఆసక్తి సాధించగలనని పట్టుదల ఉంటే చాలు మేము చెప్పినట్టు కమిట్మెంట్తో పని చేస్తే తప్పకుండా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు దీని ద్వారా మహిళలు గృహిణులు ఆర్థికంగా సామాజికంగా రాణించడానికి ఇది చక్కని అవకాశం అని తెలిపారు ఈ సమావేశంలో బ్రాంచ్ మేనేజర్ మోతె రవికుమార్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily