D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా /గంగారం / జూలై15(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ ఏజెన్సీ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ ఏజెన్సీ ప్రాంతంలోని కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని దుబ్బగూడం, కామారం,మర్రిగూడెం, కోమట్ల గూడెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది యొక్క రికార్డులను పరిశీలించి తగిన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్షాకాలం సీజన్లో ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల పైన అవగాహన కల్పించే కార్యక్రమాలను క్షేత్రస్థాయి సిబ్బంది కల్పించాలని వారికి అవసరమైన సలహాలు సూచనలను ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే ప్రజలకు కీటక జనిత వ్యాధుల పైన అవగాహన కల్పించి ఒకవేళ ఎవరికైనా మలేరియా, డెంగ్యూ, పాజిటివ్ నిర్ధారణ అయితే వారికి పూర్తిస్థాయి చికిత్స అందించలని ఆయన తెలిపారు. అంతేకాకుండా అసంక్రమణ వ్యాధుల పైన 30 సంవత్సరములు దాటిన వారందరికీ రక్తపోటు,షుగర్ వ్యాధుల పైన స్క్రీనింగ్ చేసి ఒకవేళ నిర్ధారణ జరిగినట్లయితే వారికి క్రమం తప్పకుండా మందులను అందించాలని ఆయన పేర్కొన్నారు, ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్ ఎల్ హెచ్ పి లు గ్రామాలలో క్యాంపులను ఏర్పాటు చేసి ఆర్డిటి పరీక్షలను నిర్వహించాలని తెలిపారు. అనంతరం కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్నటి దినము ప్రసవించిన బాలింత రాలు యొక్క ప్రసవానంతరం తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను అందించారు.ఈ కార్యక్రమంలో కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సాయినాథ్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్ ఆరోగ్య విద్యా బోధకులు కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ సూపర్వైజర్ రత్నకుమారి స్థానిక ఎమ్మెల్యే హెచ్. పి. లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily