AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే10 అక్షరం న్యూస్ యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలిస్తూ,గత 25 రోజులుగా పెద్దపల్లి నియోజకవర్గవ్యాప్తంగా సాగుతున్న జ్యోతిబా ఫూలే-అంబేద్కర్ జై యుగం కప్' క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో విజయవంతంగా ముగిసింది.బీసీ జేఏసీ చైర్పర్సన్ శ్రీమతి దాసరి ఉష ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్,పెద్దపల్లి మండలంలోని మదర్ థెరిస్సా కాలేజ్ గ్రౌండ్లో అత్యంత ఉత్సాహంగా జరిగింది.మండల స్థాయి ఫైనల్ మ్యాచ్లో పెద్దకాల్వల మరియు కొత్తపల్లి జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మైదానమంతా క్రీడాకారుల కేరింతలు, అభిమానుల కోలాహలంతో సందడిగా మారింది.ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పెద్దకాల్వల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, విన్నర్స్ షీల్డ్తో పాటు రూ.10వేల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. రన్నరప్గా నిలిచిన కొత్తపల్లి జట్టు షీల్డ్ మరియు రూ.5వేల నగదును గెలుచుకుంది.ఈ ముగింపు వేడుకకు దాసరి ఉష భర్త ఎస్.ఎస్.బి కమాండర్ జుట్టు ఆశీష్ కుమార్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దురలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని,అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని కలుపుతూ గత 25 రోజులుగా ఇంతటి భారీ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన దాసరి ఉష కృషిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మహిళా కన్వీనర్ సిరవేణ స్వప్న,నర్ల సాయి,సంతోష్,20వ వార్డు కౌన్సిలర్ రాజేష్,ఎస్.సి.సి.ఎల్ కాంట్రాక్టర్ శ్రీనివాస్,అసెంబ్లీ కోఆర్డినేటర్లు భూమేష్,అబ్దుల్ మాలిక్,ఆర్గనైజర్ శ్రావణ్,రాజేందర్,సాగర్,క్రీడా కారులు,తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily