AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 14/అక్షరం న్యూస్/----- పెద్దాడ వెంకట గోపాలస్వామి శ్రీమతి పార్వతి శ్రీమతి ప్రమీల జ్ఞాపకార్థం వారి మనవడు ముప్పిరిశెట్టి జ్ఞానేశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు శేషారావు వరలక్ష్మీ దంపతులు వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్థి నిలయం విద్యార్థులకు ఒక పూట భోజనము మరియు వంట పాత్రలను వితరణ గా అందజేశారు. అనంతరం వనవాసి తెలంగాణ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామాల ఆదివాసీ విద్యార్థులను అక్కున చేర్చుకొని వారికి సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు చక్కటి విద్యా బుద్ధులు నేర్పిస్తూ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కొరకు పాటు పడుతున్న వనవాసి కళ్యాణ పరిషత్ సేవలకు ముగ్ధులై హైదరాబాద్ వాస్తవ్యులైన శేషారావు వరలక్ష్మి దంపతులు విద్యార్థులకు అవసరమగు వంట పాత్రలను వితరణ గా అందజేశారని ఆమె అన్నారు. దాతలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వకమైన ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జవ్వాది మొరళీ కృష్ణ ఉపాధ్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు కమిటీ సభ్యులు పొలిన రమాదేవి గ్రామీణ వైద్యులు బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily