AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఆగస్టు 1--- బాల్య మిత్రుడు సిద్ధి రాజేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులు లక్ష్మి నరసింహా రెడ్డి అరుణ్ బాబు విజయ్ లు గవర్నమెంట్ హాస్పటల్ కు బీపీ మిషన్ ను వితరణ గా అందజేశారు. గత కొద్ది రోజులుగా హాస్పటల్ నందు బీపీ మిషన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మిత్రుడి జన్మదిన సందర్భంగా రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీపీ మిషన్ ను వితరణ గా అందించడం జరిగిందని మిత్రులు లక్ష్మి నరసింహా రెడ్డి తెలిపారు. యువత పుట్టినరోజు పెళ్ళి రోజు అంటూ వృధా ఖర్చు చేయకుండా సమాజ సేవకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి వర్ధన్ డాక్టర్ పెద్దాడ గీతానంద పార్వతి కాంత్ సినియర్ జర్నలిస్టు బోబ్బిలి పాటి రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily