GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /నవంబర్ -06(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలము లో ని పోతుగల్,చీకోడ్,మద్దికుంట , మొఱ్ఱపూర్.గ్రామ లతోపాటు ఇతర గ్రామ లశివారులలో వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మోటార్లు, వాహనాల బ్యాటరీలు, అపహరించే వారిని పోలీసులు అదివారం అరెస్టు చేశారు సిరిసిల్ల డీఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాల వెల్లడించారు.దుబ్బాక మండలాకేంద్రానికి చెందిన పర్వతం శ్రీను, బాలసంత అలియాస్ నూనె, అలియాస్,డిజే సాయికుమార్ లు వృత్తి రీత్యా పాత సామాను అమ్ముకుంటు జీవితం కొనసాగిస్తున్నారు వారి కుటుంబ పోషణ కు, జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని, వారికీ తెలిసిన మరో ఇద్దరు ఐనా గజ్వెల్ మండలం సంగుపల్లి గ్రామానికి చెందిన బడే అనిల్, మోతె సాయిలు లకు తెలపడం తో పోయిన అక్టోబర్ నెలలో తెర్లు మద్ది శివారులో ని అర్జున్ క్రాషర్ లో 3చరవాణి లు అదే రోజుముస్తాబాద్ శివారులోని శ్రీ తిరుమల రైస్ మిల్ నందు నాలుగు కరెంట్ మోటార్లు ఎత్తుకెళ్లారని తెలిపారు అక్టోబర్ 21వ తేదీన అర్జున్ క్రాషర్ లో చొరబడి 7టిప్పర్ల బ్యాటరీలు, ఒక ట్రాక్టర్ బ్యాటరీ 2స్టోన్ కట్టలో సీజల్, 2బీ టీ లింక్ చైన్లు,ఇతర ఇనుప సమాను ఎత్తుకెళ్లారని తెలిపారు.ఎత్తుకెళ్లిన వస్తువులు అమ్మడం కోసం పార్వతం శ్రీను, బాలసంత, వారి టీవీ ఎస్ ఎక్సెల్ పై రాగ... స్థానిక ఎస్ ఐ చిందం గణేష్ తన సిబ్బంది తో బంధనకల్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా. అనుమాన స్పదంగా కనబడడంతో వారి ఇరువురిని విచారించగా దొంగతనం కేసు వెల్లడైందని తెలిపారు వారు దొంగలించిన వస్తువులను స్వాధీన పరుచుకున్నామని, వాటి విలువ సుమారు రు 4,07000 లక్షల ఏడు వేల రూపాయలు ఉంటాయని తెలిపారు. దొంగతనం ఛేదించిన ముస్తాబాద్ ఎస్సై గణేష్ ను వారి సిబ్బంది సిహేచ్, రాజశేఖర్,టీ నరేష్,యండి కాసీం లను డీఎస్పీ అభినందించారు ఇంకో ఇద్దరు దొంగలు పరారి లో ఉన్నారని తెలిపారు
.
Aksharam Telugu Daily