Wednesday, 05 August 2026 02:35:45 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కోమట్లగూడెం, గంగారం కొత్తగూడ, గూడూరు తీగలవేణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్య సేవలు

వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించాలి* :: *జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్*


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 04 August 2026 06:09 PM Views : 95

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఆగష్టు 4(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా లో ఉన్న మండల లోవైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో *జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్* జిల్లాలోని మండల ప్రాథమిక వైద్యాధికారులతో గూగుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గూడూరు, కోమట్ల గూడెం, కొత్తగూడ, తీగల వేణి, గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రత్యేకమైన సీజనల్ వ్యాదులలో భాగంగా విష జ్వరాలు, అతిసారం, పాము, తేలు కాటు మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా డెంగ్యూ ,మలేరియా జ్వరముల వార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించవలసిందిగా సూచిస్తూ, జాతీయ ఆరోగ్య కేంద్రాల పథకాలపై సమీక్షించి, లక్ష్యాలు సాధించాలని సూచించినారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశలు అంగనవాడి సిబ్బంది సమన్వయంతో తల్లి పాల ప్రాముఖ్యత లో కాన్పు కాగానే బిడ్డకు తల్లిపాలు( ముర్రిపాలు) పట్టించవలసిందిగా, ఈ పాలు మొదటి టీకా వలె వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, జ్వరాల నియంత్రణలో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా ఉండకుండా డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామపంచాయతీ సిబ్బంది సమన్వయంతో పరిసరాల పరిశుభ్రత, దోమల పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శివకుమార్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, స్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :