D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : * ** ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా మే 13 (అక్షరం న్యూస్) 20 వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు సేవాపథలో కొనసాగుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు. వైరా మున్సిపాలిటీ లోని 20 వార్డులో ఇటీవల పదవ తరగతి ఫలితాలలో అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు ఆ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు, డాక్టర్ మురళీకృష్ణ అందజేశారు. ముందుగా వారిని ఘనంగా శాలువతో సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మరింత విద్య మెరుగుపరుచుకునేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంగా, కాదు ఇష్టంగా చదివితే మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోధించుతారని అన్నారు. అలాగే మీ తల్లిదండ్రుల కష్టం వృధా చేయకుండా ఉన్నత చదువులు చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల పెనుగొండ ఉపేందర్ రావు, వంకడూత్ బిక్యా, తేజవత్ నాగేశ్వరావు, హుస్సేన్, పృద్వి దుర్గా నాయక్, దర్గయ్య, రమేష్, తేజావత్ బాల్య,గోపి నాగేశ్వరావు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily