Monday, 15 December 2025 06:45:45 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గుజరాత్ ఘోర విమాన ప్రమాదంపై మాజీ ఎంపీ నామ తీవ్ర విచారం

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 June 2025 10:34 AM Views : 481

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జూన్ 12 (అక్షరంన్యూస్) గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ వద్ద గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురి కావడం పట్ల బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టేకాఫ్ సమయంలో విమానాశ్రయానికి సమీపాన ఉన్న మెడికల్ కాలేజీ భవనం పైన అది కూలడంతో పలువురు ప్రయాణీకులు, మెడికల్ విద్యార్థులు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని నామ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నామ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రాన్ని, గుజరాత్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యానివ్వాలని నామ భగవంతున్ని ప్రార్థించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :