Friday, 14 November 2025 01:31:15 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రవాణా శాఖలో వసూళ్లకు అంతం లేదు*... *బహిరంగంగానే వసూళ్లు*, *చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు*, *ఇకనైనా వాహన యజమానుల బాధలు తీరుస్తారా*

అవినీతి నిరోధక శాఖ అధికారు లారా ఓసారి దృష్టి సారించండి*,


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 March 2025 01:57 PM Views : 675

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *, * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ /మార్చి 13 (అక్షరంన్యూస్)* రవాణా శాఖ కార్యాలయంలో అవినీతికి అంతులేకుండా పోయింది. ఇనుప చీపిరితో అందినంతవరకు ఊడ్చేస్తున్నారు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి.. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వాహనాలను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఏ పనైనా నిమిషాల్లో చేపిస్తామంటూ ఏజెంట్లు వాహన యజమానులను దోచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో అనుమతి లేని వాహనాలకు ఇక్కడ అనుమతులు లభిస్తున్నాయి.. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి పనులు చేస్తున్నారు. చాలాన్ కడితే కావలసిన పనులు కావడం లేదు, సంప్రదిస్తేనే పనులు జరుగుతున్నాయి. దళారి ఇన్షల్ వేస్తేనే అధికారులు ఫైల్ మూవ్ చేస్తారు లేదంటే, రేపు రా మారా అంటూ ఏదో వంకతో నెలల తరబడి తిప్పుతూనే ఉంటారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, అయోమయంలో వాహన యజమానులు, హెవీ వెహికల్స్ లో పరిమితికి మించి లోడు లోను నెల నెల మామూలు వసూలు చేస్తున్నారు, అనే ఆరోపణలు వస్తున్నాయి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనానికి వంద రూపాయలు, నాలుగు చక్రాల వాహనానికి రూ 500, హెవీ లైసెన్స్ వెయ్యి రూపాయలు, టాక్సీ ప్లేట్, ఆటో రిక్షా, ట్రాక్టర్ ఇంజన్, ట్రక్కు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర చెల్లించాల్సిందే, రైతులకు సంబంధించి పొలం కలిగిన ఉంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి కానీ నిబంధనలు ఏవిపరవర్తించడం లేదు ఇస్తాను సారంగా వస్తుంది. ప్రతి పనికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చెల్లించాలి అనుమతి లేనివాళ్లు ఇక్కడ 10000 చెల్లిస్తే వెంటనే అనుమతి ఇస్తారు. రెండు అధికారాలు నిర్వహిస్తున్న ఓ అధికారి ఆదాయం చూస్తే మతిపోవాల్సిందే, వెహికల్స్ కు అనుమతులు ఇస్తున్నారు, బొడుపులు చెల్లిస్తే ఏ పనైనా నిమిషాలలోనే, ఇది ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం పరిస్థితి, ఇకనైనా అధికారులు, మంత్రులు స్పందించి అవినీతి అధికారుల పై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :