GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 22/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కుల గూడెం గ్రామానికి చెందిన ఆకుల రవికుమార్ (గాంధీ) ఇటీవల కాలంలో గుండె నొప్పి (హార్ట్ ఎటాక్) తో అకస్మాత్తుగా మరణించారు. రవికుమార్ కు ఇద్దరు కూతుర్లు భార్య ఉన్నారు. రవికుమార్ కు ఎలాంటి స్థిరాస్తులు లేవు నిరుపేద కుటుంబానికి చెందిన రవికుమార్ కుటుంబానికి ఎంతో కొంత సహకారాన్ని అందించాలన్న ఉద్దేశంతో గ్రామంలోని పెద్దలు యువకులు వారి వంతు సహాయంగా 10,8000 రూపాయలను రవికుమార్ కూతుర్లకు అందజేసి గ్రామ ఐక్యతను చాటారు. గ్రామంలో రవికుమార్ అందరితో ఐక్యమత్యంగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండేవారని వారి మృతి పట్ల గ్రామ ప్రజలందరూ తీవ్ర దిగ్బ్రాంతి కి లోనయ్యారు. ఇంకా పట్టణ ప్రముఖులు ఎవరైనా ఉంటే రవికుమార్ కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్థిక సహకారం అందించిన వారిలో జమ్మికుంట 9వ వార్డు మాజీ కౌన్సిలర్ పొనగంటి రాము, సమ్మెట రవి, కంశెట్టి మోహన్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily