GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జనవరి -01(అక్షరం న్యూస్ ) కాల చక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. గత యేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం నుంచే విందులు, సంబరాలు ప్రారంభమయ్యాయి. మద్యం, మాంసం, కేక్లు, కూల్ కేక్లు, రంగవల్లుల, కూల్డ్రింక్లు, రకరకాల రంగులు విక్రయాలు జోరుగా సాగాయి. ఆయా కూడళ్ళ దగ్గర, స్వీట్ హౌజ్, ఇతర దుకాణాల వద్ద కేక్లు విక్రయించారు. నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ బుధవారం రాత్రి 12 గంటలకు సంబరాలు అంబరాన్నంటాయి.కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో ప్రజలు బుధవారం, ఉదయం నుంచే పెద్ద మొత్తంలో కేకులు కొనుగోలు చేశారు.రాత్రి 9గంటల నుంచే.స్థానిక ఎస్ ఐ గణేష్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ లు నిర్వహించారు.గురువారం నూతన సంవత్సరం సందర్భంగా మహిళలు ఇంటిముందు రంగు రంగుల ముగ్గులు వేశారు.ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.. గురు వారం ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని, అంతా శుభం జరగాలని భక్తులు కోరుకున్నారు
.
Aksharam Telugu Daily