AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 14/ అక్షరం న్యూస్/------ ఛత్తీస్ ఘడ్ బస్తర్ లో నక్సలైట్లు మరోసారి బిజెపి నాయకుడిని దారుణంగా హత్య చేశారు. ఇన్ ఫార్మర్ అని ఆరోపిస్తూ నక్సలైట్లు బీజాపూర్ జిల్లాకు చెందిన పూనం సత్యం ను హత్య చేశారు. నక్సలైట్లు మునుపటి వ్యూహాలను పునరావృతం చేస్తూ వారు మృతదేహం దగ్గర ఒక కరపత్రాన్ని వదిలి అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. మధ్ధీద్ ఏరియా కమిటీ ఈ హత్యకు బాధ్యత వహించింది. బ్రాహ్మణ హిందుత్వం ఆధారిత బిజెపి ఆర్ఎస్ఎస్ మోడీ విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం మార్చి 2026 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లక్ష్యం దిశగా బిజెపి ప్రతి గ్రామంలో తన సంస్థను బలోపేతం చేస్తోంది. పోలీస్ ఇన్ ఫార్మర్ నెట్వర్క్ ను సమీకరిస్తుతూ సమాచారం ఆధారంగా మా పార్టీపై దాడి చేస్తుందని నక్సలైట్లు మృతదేహం దగ్గర కరపత్రాన్ని వదిలి వెళ్లారు.
.
Aksharam Telugu Daily