P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి డిసెంబర్ 09 (అక్షరం న్యూస్) స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకో పడతాయని ఎస్ఐ దీకొండ రమేష్ హెచ్చరించారు ఈ సందర్భంగా మంగళవారం అక్షరం ప్రతినిధితో మాట్లాడుతూ గ్రామపంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు 2025 నేపథ్యంలో.... రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీలు, ఆరు ఆమ్లెట్ విలేజ్ పరిధిలోని ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, యువత ఈ విషయాన్ని గమనించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు .పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో. అన్ని గ్రామాల వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్స్ లలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టవద్దని సూచించారు. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసిన కించపరిచేలా మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు ల కి సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఎస్సై దీకొండ రమేష్ ప్రజలను కోరారు
.
Aksharam Telugu Daily