Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ / ఏప్రిల్ తల్లాడ/ 2 (అక్షరం న్యూస్)* ఖాళీగా తల్లాడ బస్టాండ్ గదులు, క్యాంటీన్, కరోనా కాలం నుండి ఇప్పటివరకు నాలుగు గదులు, క్యాంటీన్, సెలూన్, ఖాళీగానే ఉంటున్నాయి, దీంతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుంది, తల్లాడ బస్టాండ్ సి క్లాస్, ధరలు స్థాయిని బట్టి నిర్ణయించి, టెండర్లు పిలిచి, గదులు క్యాంటీన్ కేటాయించాలని, వాహనదారులు, వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు, ఉన్నతాధికారులు లీజుకు ఇవ్వమని, ఆదేశాలు ఇచ్చిన జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు, కరోనా అనంతరం గదులు లేచి ఇచ్చింది లేదు దృష్టి సారించకపోవడంతో ఆర్టీసీకి నష్టం జరుగుతుంది, నిబంధనలు సడలించి, గదులు అద్దెకిచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు, టెండర్లు తీసుకొని డిపాజిట్లు తీసుకుని, అప్రూవల్ కాలేదని, మూడు రోజుల్లో ఇవ్వాల్సిన డిపాజిట్లు మూడు నెలల తర్వాత తిరిగి ఇచ్చారని వ్యాపారుల ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, టెండర్లు పిలిచి గదులు ఖాళీగా లేకుండా చేయాలని, ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని అడ్డుకోవద్దని ప్రజలు ఆర్టీసీ అధికారులకు విన్నవిస్తున్నారు, ప్రయాణికుల సౌకర్యం కోసం క్యాంటీన్ షాపులు ఏర్పాటు చేయాలని, ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily