D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 7 వైరా (అక్షరం న్యూస్) గత ఐదేళ్ల క్రితం వైరా రింగ్ రోడ్డు సెంటర్ విస్తరణలో భాగంగా తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ చిన్న వ్యాపారులకు త్వరలోనే విముక్తి కలగనుంది. శనివారం వైరా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రింగ్ రోడ్ సెంటర్ బాధితులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే చొరవతో చేరిన ఫిర్యాదు స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఈ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను తొలగించడంతో, అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు భట్టి విక్రమార్క స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. తిరిగి షాపుల నిర్మాణం.. బాధితుల గోడు విన్న ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. నష్టపోయిన వ్యాపారులకు ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతు ఉంటుందని, అక్కడ తిరిగి షాపులు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల హర్షం: ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న తమ సమస్య పరిష్కారానికి హామీ లభించడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్. వర్తక సంఘం నాయకులు మిట్టపల్లి రాఘవరావు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ల పాటి సీతారాములు వేముల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily