Wednesday, 04 March 2026 01:48:07 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

డీజీపీని కలిసిన ఖమ్మం బీజేపీ నేతలు.. 4 అంశాలపై వినతిపత్రం సమర్పణ.. ఫిర్యాదు అంశాలను పరిశీలిస్తానని డిజిపి హామీ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 24 October 2025 08:11 PM Views : 460

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/అక్టోబర్‌ /24 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లాలో ప్రజల భద్రత, సామాజిక న్యాయం, జరుగుతున్న అక్రమాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా నాయకత్వం రాష్ట్ర పోలీసు ప్రధానాధికారి (డీజీపీ)ని నేరుగా సంప్రదించింది. శుక్రవారం హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్చార్జ్ జాతీయ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు లతో కూడిన జిల్లా బృందం డీజీపీని కలిసి, నాలుగు కీలక అంశాలను స్పష్టంగా ప్రస్తావిస్తూ వినతిపత్రాన్ని సమర్పించింది. వినతిపత్రంలో ప్రధానంగా నాలుగు అంశాలను నేతలు ప్రస్తావించారు. మొదటగా, అక్టోబర్‌ 18న సత్తుపల్లిలో జరిగిన బీసీ బంద్‌ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు కమల్‌ పాషా తదితరులు బీజేపీ సత్తుపల్లి మండల అధ్యక్షులు బానోతు విజయ్‌ లతోపాటు కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని నేతలు ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా సాగుతున్న బంద్‌ కార్యక్రమానికి భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అంతేకాక, కమల్‌ పాషా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడని, ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రెండవ అంశంగా, పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్‌ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో జరిగిన భారీ అవకతవకలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, బోర్లు ఉన్నవారికి ఇళ్లు కేటాయించడం, గుడిసెల్లో ఉన్న పేదలను నిర్లక్ష్యం చేయడం సామాజిక అన్యాయమని వారు డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. మూడవదిగా, ఖమ్మం-ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో గోవుల అక్రమ రవాణా నిరంతరం కొనసాగుతోందని, దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న గోరక్షకులు బెదిరింపులకు గురవుతున్నారని నేతలు తెలిపారు. గోవుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే గోరక్షకులకు పోలీసు రక్షణ కల్పించాలని వారు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. చివరి అంశంగా, ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కొనసాగుతుందని, ఈ విషయంపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అక్రమ రవాణా అలాగే సాగుతుందని నేతలు వివరించారు. ప్రధానంగా ఖమ్మం పట్టణంలో కళాశాలలు, పాఠశాలలను అడ్డాగా చేసుకుని గంజాయి వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా తిరుగుతుందని బీజేపీ తరఫున ఫిర్యాదు చేశారు. డీజీపీ వినతిపత్రాన్ని స్వీకరించి, ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినారు. జిల్లాలో చట్టవ్యవస్థను కాపాడి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. డీజీపీని కలిసిన వారిలో నాయకులు దేవకి వాసుదేవరావు, ఈ వి రమేష్, నంబూరి రామలింగేశ్వరరావు, నాయుడు రాఘవరావు లు కూడా ఉన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :