Saturday, 22 November 2025 11:09:20 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్....

-కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరణ... పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలి - పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 16 September 2025 06:54 PM Views : 423

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / పాల్వంచ : పాల్వంచ/కిన్నెరసాని అక్షరం న్యూస్ / సెప్టెంబర్ 16  : కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్థాపనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకల  కోసం ప్రత్యేక లోగోను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ లు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోగో ఆవిష్కరణ అనంతరం పలువురు ప్రసంగిస్తూ స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రిటైర్డ్ టీచర్ చక్రవర్తి మాట్లాడుతూ, ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించి స్వర్నోత్యవా లను విజయ వంతం చేయాలన్నారు.  పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, గత అయిదు దశాబ్దాలుగా ఈ విద్యాసంస్థ వేలాది గ్రామీణ విద్యార్థుల జీవితాలను వెలిగించిందని, భవిష్యత్తులోనూ పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు.  సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా ముందుకు వచ్చి డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, వెంకటరత్నం, శ్రీనివాస్ కుమార్, ఎం. సత్యనారాయణ తదితర పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, వివిధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :