Monday, 20 April 2026 05:45:45 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కూరగాయలు మార్కెట్ లో జరిగిన ఏచూరి వర్ధంతి...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 12 September 2025 05:20 PM Views : 425

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) లౌకిక విలువల కోసం పోరాడిన ఏచూరి అని సిపిఐ పార్టీ ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై విక్రమ్ పేర్కొన్నారు. శుక్రవారం బైపాస్ రోడ్ కూరగాయలు మార్కెట్ లో సీతారాం ఏచూరి వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, సమానత్వం, సోషలిజంలపై ఆర్ ఎస్ ఎస్ దాని పనుపున నడుస్తున్న బీజేపీ కేంద్ర సర్కార్ తీవ్రమైన దాడి చేస్తున్న తరుణంలో దాన్ని ఎదిరించి పోరాడే శక్తులను ఐక్యపర్చి ముందుకు తీసుకుపోవడంలో ఏచూరి కృషి అసమానమైనది అని వై విక్రమ్ పేర్కొన్నారు. మన దేశంలో ఎన్నో త్యాగాలతో సాధించుకున్న లౌకిక భావన పై బిజెపి ప్రభుత్వం దాడి చేయడం దేశ ప్రజలు గమనించాలని కోరారు. నూతన సంస్కరణలు పేరుతో దేశాన్ని కొల్లగొడుతున్న అదానీ, అంబానీ లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని, మరోవైపు బీజేపీ ప్రభుత్వం రెచ్చగొడుతున్న మత ఉన్మాదం పై ఏచూరి ఆశయాలతో తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు సైదులు, సీతయ్య, సత్యనారాయణ, వెంకన్న, శ్రీనివాసరావు, మల్లికార్జున్ రెడ్డి, గుమ్మడి బిక్షం తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :