Friday, 06 March 2026 03:25:00 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

స్థానికంగా ఉండరు... సమయపాలన పాటించరు సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పై కలెక్టర్ దృష్టి పెట్టాలి బిఎస్ ఎఫ్ ఐ మండలాధ్యాక్షుడు కొట్టే నవ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 11 August 2025 08:21 PM Views : 635

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 11/ అక్షరం న్యూస్/---- మండల కేంద్రం లోని గ్రామపంచాయతీ కాంప్లెక్స్ నందు శీలం సంతోష్ అధ్యక్షతన బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మండలం అధ్యక్షులు కొట్టే నవీన్ హాజరైయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లోని విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ కాలేజీలో పర్యటించి కాలేజీలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. కాలేజీలో ఉన్న అధ్యాపకులు సగానికి పైగా ఎవరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని స్థానికంగా ఉండడం లేదని ఇష్టానుసారంగా సమయపాలన పాటించకుండా వస్తున్నారని ఆయన అన్నారు. క్లాస్ రూమ్ లలో సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారు. కళాశాల లోని అధ్యాపకులు గ్రూప్ లుగా ఏర్పడి గ్రూప్ రాజకీయాలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారానీ అన్నారు. కాలేజీ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. దట్టమైన పోదలు పెరగడం వల్ల విష సర్పాలు తిరుగుతున్నాయి. విద్యార్దులను దృష్టిలో ఉంచుకొని పరిసరాలను శుభ్రం చేయించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సమయ పాలన పాటించాలన్నారు. లేనియెడల బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాద్యాక్షుడు ఎం ఎల్ నారాయణ నీలం సంతోష్ కట్ట రాజేష్ జంజీరాల సుజిత్ ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :