Monday, 19 May 2025 10:43:07 PM

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు -- *మాజీ ఎంపీపీ గంగారం

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 07 May 2025 03:01 PM Views : 162

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే 7(అక్షరం న్యూస్) గంగారం మండలం లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని గంగారం మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు సువర్ణపాక సరోజన జగ్గారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో ఇళ్లనిర్మాణం కోసం ఇందిరమ్మ కమిటీలు సూచనలు, నిబంధనలు ప్రకారం సర్వే పరిశీలన చేసి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మాజీ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు సూచించారు. గంగారం మండలం లో ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కమిటీ సూచనలు, నిబంధనలు ప్రకారమే పంచాయతీ రాజ్, హౌసింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలని గంగారం మాజీ ఎంపీపీ అన్నారు. ఆలా కాకుండా లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హేచ్చరించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :