Monday, 16 February 2026 04:31:47 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంతో జరిగేలా సమన్వయంతో పనిచేయాలి... అడిషనల్ డీసీపీ (లా&ఆర్డర్) ప్రసాద్ రావు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 10 February 2026 03:50 PM Views : 181

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 10 వైరా (అక్షరం న్యూస్) మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంతో జరిగేలా సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ డీసీపీ (లా&ఆర్డర్) ప్రసాద్ రావు అన్నారు. వైరా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పోలీస్ సిబ్బంది యెుక్క ఎన్నికల విధులు, విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై వైరా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో వైరాలోని వెటర్నరీ హాస్పిటల్ భవనంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పనిచేయాలన్నారు. ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని,ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని స్పష్టంచేశారు.ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్వహించే విధులలో పూర్తి అవగాహన వుండాలన్నారు. అదేవిధంగా ఎన్నికల ముగిసిన తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకొవాలని సూచించారు. సెక్షన్ 163 బిఎన్ ఎన్ ఎస్ అమలులో ఉన్నందున పోలింగ్ కేంద్రల పరిసరాల్లో గుంపులు గుంపులుగా లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో సిసిఎస్ ఏసిపి సర్వర్, సిఐలు, ఎస్సై లు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :