AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగస్టు15 అక్షరం న్యూస్ మనకు స్వాతంత్ర్యం రావడానికి లక్షలాది మంది పోరాటం, వేలాది మంది ప్రాణ త్యాగాలు కారణమని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు నారాయణ దాస్ అశోక్,పోగుల విజయ్ కుమార్ అన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మహాత్మా గాంధీ,డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం కుల, మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే జాతీయ పండుగ అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను,భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కృషిని,రాజ్యాంగ విశిష్టతను వివరించారు.దేశం కోసం అమరులైన వారి త్యాగాలను కొనియాడారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు,పాత్రికేయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో గౌరవ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి, ప్రెస్ క్లబ్ సభ్యులు వీరమల్ల విద్యాసాగర్ రావు, ముత్యాల కృష్ణమూర్తి, శ్రీరాముల సురేష్, ఈదునూరి జైపాల్, బోనాల నాగరాజు, కొలిపాక కృష్ణ, రావుల చంద్రమౌళి, ఉప్పు శ్రీనాథ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily