AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : ... హైదరాబాద్ / అక్టోబర్ 24/ అక్షరం న్యూస్ -: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులకు ప్రచార బాధ్యతలను అప్పగించడం జరిగింది. దీనిలో భాగంగానే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ పి. సి. సి మెంబర్ మొహమ్మద్ అయూబ్ ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడా డివిజన్లో ప్రచార బాధ్యతలకై నియమించడం జరిగినది. ఈ నియామకానికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ఇమ్రాన్ ప్రతాప్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపినారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకై నేటి నుండి యూసుఫ్ గూడా డివిజన్లో ప్రచారంలో పాల్గొంటానని తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను నియోజక వర్గ ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయ పర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకై శక్తి వంచన లేకుండా శ్రమించి ప్రచారం చేస్తానని తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలంగాణ పి. సి. సి మెంబర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ మొహమ్మద్ అయూబ్ అన్నారు.
.
Aksharam Telugu Daily