GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/సెప్టెంబర్ 12/అక్షరం న్యూస్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఆకుల రాజయ్య పటేల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం రావు పటేల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పురుషోత్తమరావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల ఐక్యత కోసం సంఘ ప్రతిష్ట కోసం కృషి చేయాలని రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రయత్నం చేయాలని అప్పుడే మనం ఆర్థికంగా, రాజకీయంగా బలపడతామని పుట్టం పురుషోత్తమరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పర్వతం సతీష్ పటేల్, కోశాధికారి కంచి సత్యనారాయణ పటేల్, హుజూరాబాద్ సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్ పటేల్, కొలకాని రాజు పటేల్, ఆకుల పోచయ్య పటేల్, పొన్నగంటి రవి పిజెఆర్ పటేల్, ఆకుల తిరుపతి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily