GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 07/అక్షరం న్యూస్: యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ సొంతగూటికి చేరారు. బుధవారం ఆయన హుజురాబాద్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ పార్టీలో చేరారు. ప్రశాంత్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణారెడ్డి బిజెపి కండువా కప్పి యువ నాయకుడు ప్రశాంత్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రశాంత్ గతంలో బిజెపిలో క్రియాశీలకంగా పనిచేసిన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంతో పాటు ఇతర సందర్భాల్లోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచిన మద్దుల ప్రశాంత్ పటేల్ బిజెపిలో చేరడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతానని, ప్రజా శ్రేయసు యే ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా బిజెపి నాయకుడు ప్రశాంత్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ పుప్పాల రఘు,వీణవంక మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్, బిజెపి జిల్లా నాయకులు చెన్నమనేని నరసింహారాజు, రామిడి ఆదిరెడ్డి, గొడుగు వినోద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily