AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 15/అక్షరం న్యూస్/----రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం నందు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు రామకృష్ణ విచ్చేసి జాతీయ నాయకుల చిత్రపటాలకు పుష్పాలంకరణ గావించారు.తదుపరి రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ప్రిన్సిపాల్ వర్మ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్యం సిద్ధించడానికి జాతీయ నాయకులు చేసిన కృషిని త్యాగాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో కొసరాజు హరిచరణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జవ్వాది రవికుమార్ మేడిచర్ల సత్యనారాయణ తడికల నరేష్ వాసు చింతూరి వెంకట్రావు వైస్ ప్రిన్సిపాల్ ఎం వి ఎల్ నరసింహారావు తెలుగు భాష అధ్యాపకులు కొంగురి ప్రదీప్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily