AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : రాయికల్, ఏప్రిల్ 04, అక్షరం రాయికల్ మండలం వడ్డేలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖ క్యాన్సర్ ను నిరోధించే టీకా కార్యక్రమాన్ని వైద్యాధికారి డా.కస్తూరి సతీష్ కుమార్ సమక్షంలో సర్పంచ్ నాగుల మానస శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..14నుండి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు ఈ టీకా తీసుకొని గర్భాశయ ముఖ క్యాన్సర్ నుంచి రక్షణ పొందాలని సూచించారు. మండలంలోని అర్హత గల బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం మొదటి రోజు నలుగురు బాలికలకు హెచ్ పీ వి టీకాలు అందజేశారు. ఈకార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఇల్లెందుల శ్రీనివాస్, నర్సులు మౌనిక, సుమలత, ఫార్మసిస్టు దీపిక, ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి, ఏఎన్ఎం భాగ్యలక్ష్మీ, కార్యదర్శి సాయి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily