AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 21 అక్షరం న్యూస్ ఉద్యోగుల ఐక్యతకు టీఎన్జీవోస్ జెండా ప్రతీకగా నిలుస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ అన్నగారి పిలుపు మేరకు శుక్రవారం పెద్దపల్లి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో టీఎన్జీవోస్ అధికారిక జెండా, కండువా, ‘ఉద్యోగ గొంతుక’ మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ‘ఉద్యోగ గొంతుక’ మాసపత్రిక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వేదికగా నిలుస్తుందని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అయిరెడ్డి సందీప్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న మహాధర్నా, సెప్టెంబర్ 1న చేపట్టనున్న పెన్షన్ విద్రోహ దినం నిరసన, సెప్టెంబర్ 10న నిర్వహించే చలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపు అనిత, కొమురయ్య, ఆడెపు శ్రీనివాస్, మహేందర్రెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, సౌమ్య, స్వప్న, అడ్ల పురుషోత్తంరెడ్డి, నూకల శంకర్, జగన్, సరిత, నాయిని భాగ్యమ్మ, రాజీరెడ్డి, సందీప్రావు, రాజప్రసాద్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily