DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/ ఫిబ్రవరి 5 / అక్షరం న్యూస్:క్షయ వ్యాధి పై అవగాహనతోనే రోగిప్రాణాలను కాపాడడంతో పాటు వ్యాప్తిని నియంత్రించగలమని హెచ్ ఈవో లక్ష్మణ్ అన్నారు మండలంలోని ఇద్దులాపూర్ గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా ప్రకటించినట్లు కూనారం పీహెచ్సీ హెచ్ఇఓ లక్ష్మణ్ ప్రకటించారు. గురువారం ఇద్దులాపూర్ గ్రామంలో నిర్వహించిన టివి కుష్టు వ్యాధి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రజాప్రతితులు సహకరించడం వల్లే టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. టీబీ కుష్టు వ్యాధి లక్షణాలు నిర్ధారణ నివారణ చికిత్స అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీబీ రైతు గ్రామంగా కృషి చేసినందుకు వైద్యులను సర్పంచ్ మామిడి లత అభినందిస్తూ హెచ్ ఓ లక్ష్మణ్ కు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత అశోక్ ఉప సర్పంచ్ నూనె హరీష్ వార్డు సభ్యులు కొమురయ్య రాజకుమార్ స్వప్న మన్నెమ్మ చంద్రమ్మ కార్యదర్శి రాజు ఏఎన్ఎం కవిత ఆశా వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily