AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా/ వర్ధన్నపేట/ మార్చ్ 29/ అక్షరం న్యూస్ - : వర్ధన్నపేట నియోజకవర్గంలో మండల మరియు డివిజన్ అధ్యక్ష పదవుల కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ అయూబ్ మహమ్మద్ ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. మొదట వర్ధన్నపేట మండలంలోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించగా, అనంతరం పర్వతగిరి మండలంలోని జేఆర్ఆర్ గార్డెన్స్లో కూడా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేయడం అత్యంత అవసరమని తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి అర్హత, అనుభవం, ప్రజలతో అనుబంధం కలిగిన నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదని, ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో తగిన అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. పార్టీ పట్ల విశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావం కలిగినవారే భవిష్యత్తులో నాయకులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కొత్త ఉత్సాహం వచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత సమన్వయం, క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మరియు పర్వతగిరి మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల మరియు డివిజన్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు పదవులకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, శాంతియుతంగా సాగింది.
.
Aksharam Telugu Daily