AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా/ వరంగల్ టౌన్/ మార్చ్ 26/ అక్షరం న్యూస్ -: వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని వరంగల్ నగరంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. చిరంజీవి రాష్ట్ర అధ్యక్షులు కొయ్యడ ప్రభాకర్ (కరాటే ప్రభాకర్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంత ప్రాణాధారమో గుర్తించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం ద్వారా లక్షలాది మందికి ప్రాణదానం జరుగుతోందన్నారు. రక్తదానం అంటే ప్రాణదానం అనే భావనతో అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన కరాటే ప్రభాకర్ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా జన్మదినం జరుపుకుంటున్న రామ్ చరణ్కు ఆయురారోగ్యాలు కలగాలని, భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే చిరంజీవి (కొణిదల శివశంకర వరప్రసాద్) సేవలను ప్రశంసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily