Sunday, 29 March 2026 03:31:25 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఓటు హక్కు దేశ అభివృద్ధికి మార్గం చెబుతుంది ఓదెల తాసిల్దార్ ధీరజ్ కుమార్


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 25 January 2026 05:09 PM Views : 243

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి జనవరి 25 (అక్షరం న్యూస్) ఓటు హక్కు అనేది దేశ అభివృద్ధికి మార్గం చూపుతుందని తాసిల్దార్ ధీరజ్ కుమార్ అన్నారు. ఓటరు దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రం ఓదెల కస్తూరిబా గాంధీ పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని అన్నారు. సందర్భంగా ఓటరు దినోత్సవ పురస్కరించుకొని సదస్సులో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. మండలంలో ఓటరు నమోదు కార్యక్రమంలో బిఎల్ఓ లు చేస్తున్న పనితీరును ఆయన ప్రశంసించి సత్కరించారు. పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకొని గ్రామాల అభివృద్ధికి ముందుకు సాగాలని సరైన వ్యక్తిని ఎన్నుకునే హక్కు ఓటు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు దినం పురస్కరించుకొని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు వేసిన రంగుల పటం అధికారులను ముగ్ధుల్ని చేసింది. ఓటరు దినం చిత్రపటాన్ని వేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పావని స్థానిక తాసిల్దార్ ఎస్సైలు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారిని జ్యోతి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, రెవిన్యూ సిబ్బంది, కేజీబీవీ అధ్యాపక బృందం, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :