Monday, 02 March 2026 11:09:05 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఒకేషనల్ గ్రూప్ ని అందులో చదివే విద్యార్థులను అవమానించిన చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలి కొట్టి నవీన్. బహుజన్ స్టూడెంట్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 05 August 2025 01:53 PM Views : 754

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఒకేషనల్ గ్రూపులు అంటే ఎందుకంత చులకనా? భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 5/ అక్షరం న్యూస్ --- కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద బి ఎస్ ఎప్ ఐ ఆధ్వర్యంలో ఒకేషనల్ గ్రూపులను ఆ గ్రూపులో చదివే విద్యార్థులను పనికిమాలిన వాళ్లు అని అవమానించిన చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ఐ చర్ల మండల అధ్యక్షులు కొట్టే నవీన్ మాట్లాడుతూ కాలేజీ లోని ఒక విద్యార్థి నీ ఈ టీ గ్రూపు కు చేంజ్ చేయాలని కోరగా గ్రూపు చేంజ్ చేయకపోగా ఆ ఒకేషనల్ గ్రూపులన్నీ పనికిమాలిన గ్రూపులని ఆ గ్రూపులో చదువుతున్న విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ కాదని చదువు రానివారు మాత్రమే ఆ గ్రూపులో చేరతారని బిలో యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఆ గ్రూపులో ఉంటారని ఆ గ్రూపుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అనడం ఆశ్చర్యకరమని అన్నారు. అవి చెత్త గ్రూపులని కమిషనర్ కూడా మాతో అంటున్నాడని అన్నారు.ఒక బాధ్యత గల పోస్టులో ఉండి తన కాలేజీలో ఉన్నటువంటి ఒకేషనల్ కోర్సుని మంచి గ్రూపు కాదని చెప్పడం అత్యంత దుర్మార్గమని అన్నారు. విద్యార్థులను అదేవిధంగా ఆ గ్రూపుకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా ఘోరంగా అవమానించినట్లేనని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని సంబంధిత ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులను ఉపాధ్యాయులను అవమాన భారం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు ఎం ఎల్ నారాయణ బి ఎస్ ఎఫ్ ఐ చర్ల మండలం నాయకులు నీలం సంతోష్ కుమార్ కట్ట రాజేష్ ప్రతాప్ రెడ్డి బాలు, జగదీష్, సాయి సుజిత్ , భగత్ సింగ్, ధనుష్ తేజ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :