AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 20/ అక్షరం న్యూస్/--- మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇసుక లారీల కారణంగా పాడైపోయిన ప్రధాన రహదారిని బాగు చేయాలని తక్షణమే మరమ్మత్తులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సామరస్యంగా శాంతియుతంగా ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ఉన్న ఇసుకని తరలించే పనిలో ఉన్న శ్రద్ధ ఆ ఇసుక తరలించడం వల్ల పాడైపోయిన రోడ్లను బాగు చేయడం లో లేదని విమర్శించారు. భద్రాచలం నుండి వెంకటాపురం వరకు ఉన్న ప్రధాన రహదారి ఇసుక లారీల ధాటికి మొత్తం ధ్వంసం అయిందని కనీసం టూ వీలర్ తిరిగే అవకాశం కూడా లేకుండా పాడైపోయిందని అన్నారు. ఉద్యోగస్తులు ఎవరు కూడా సమయానికి ఆఫీస్ కి వెళ్లకుండా రోడ్లపై పడిన గుంటలు ఆటంకంగా మారాయని అన్నారు. అంబులెన్స్ సైతం సమయానికి హాస్పిటల్ కు చేరుకోవడం లేదని తెలిపారు. విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వడం లారీలు దిగబడిపోవడం నిరంతరం జరుగుతున్నాయని అన్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇదివరకు గంట సమయం పట్టేదని ఇప్పుడు రెండు గంటలు పడుతుందని అన్నారు. ఈ గుంటల కారణంగా అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రయాణం అంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారని అన్నారు. ఎప్పుడు ఏ బ్రిడ్జి కూలి పోతుందో తెలియని పరిస్థితిలో నియోజకవర్గంలో పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని రోజులు ప్రజలు ఈ అవస్థలు పడాలని ప్రశ్నించారు. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులకు స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అన్నారు. కనీసం ప్రజలకు రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని ఎడల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తక్షణమే బాజాప్తుగా తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో ప్రజలు బిఎస్పీ అధికారాన్ని ఇవ్వాలని తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం పాడైపోయిన ఈ రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహించాలని ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలకాలని కోరారు. లేనియెడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన పోరాటాల నిర్వహిస్తామని ప్రజా సమస్య పరిష్కారం కోసం చట్టం పరిధిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్ కుమార్ బివిఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ ములకాల సందీప్ చర్ల మండల పార్టీ ఉపాధ్యక్షులు కొండా కౌశిక్ చర్ల మండల కోశాధికారి చెన్నం మోహన్ చర్ల మండలం ఈసీ మెంబర్ షేక్ జహీరుద్దీన్ పాషా చర్ల సెక్టార్ కార్యదర్శి అయినవోలు శ్రీను చర్ల సెక్టార్ కార్యదర్శి వాసు, చెన్నం పవన్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily