D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ మార్చి 1 అక్షరం న్యూస్) ఖమ్మం సర్వజన ఆస్పత్రిలో సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి, శనివారం ఓ మహిళ చేయి విరిగి వైద్యం కోసం వస్తే ఆమె పట్ల సిబ్బంది వ్యవహరించిన తీరు, సిబ్బంది నిర్లక్ష్యానికి మచ్చుతునకగా మారింది, సుమారు నాలుగు గంటల పాటు ఎక్స్రే, కోసం వేచి చూడాల్సి వచ్చింది, రేపు రా వెళ్ళండి రా అంటూ, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితురాలు వాపోయింది, బాధతో వచ్చిన బాధితులకు ఉపశమనం కలగాల్సింది పోయి, ఆవేదన పెరిగిపోతుందని రోగులు ఆరోపిస్తున్నారు, రోగుల పట్ల సిబ్బంది వ్యవహరించే తీరు అంటరాని వారి పట్ల వ్యవహరించేలా ఉందని ఆరోపిస్తున్నారు, జిల్లా అధికారులు స్పందించి, ప్రజలకు సకాలంలో సరైన వైద్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు, *కలెక్టర్ సాబ్ జరా దేకో* జిల్లా కలెక్టర్ ఆస్పత్రి సిబ్బంది వ్యవహార శైలిపై, దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, సిబ్బంది రోగుల పట్ల వ్యవహరించి విధానాన్ని గమనించి, మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily