Saturday, 18 April 2026 06:47:12 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అన్నారుగూడెం ఎస్సీ కాలనీ సమస్యల పరిష్కారానికి... జిల్లా అధికారులు ముందడుగు...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 September 2025 04:16 PM Views : 593

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 తల్లాడ (అక్షరంన్యూస్) అన్నారుగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీ గత కొన్నేళ్లుగా చిన్నపాటి వర్షం పడినా నీటమునిగిపోవడం, కాలనీ గృహాలలో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్నారుగూడెం గ్రామ భాజపా నాయకుడు ఆపతి వెంకట రామారావు ఆధ్వర్యంలో కాలనీవాసులు పలుమార్లు జిల్లా కలెక్టర్ ని కలసి వినతిపత్రాలు అందించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో, ఈరోజు జిల్లా పంచాయతీ రాజ్ అధికారి ఆశాలత స్వయంగా అన్నారుగూడెం ఎస్సీ కాలనీని సందర్శించారు. కాలనీవాసులు, గ్రామ పెద్దలు తమ సమస్యలను నేరుగా వివరించారు. ఈ సందర్భంగా డిపిఓ కీలక సూచనలు చేశారు: • గ్రామంలోని ఎన్ఎస్పీ కాలువకు ఇరువైపులా సరిహద్దులు గుర్తించాలి • కాలువ మొత్తానికి ఇరువైపులా సిమెంట్ లైనింగ్ కోసం అంచనా సిద్ధం చేయాలి కాలువలకు ఇరుప్రక్కలా మురుగునీరు వెళ్ళే డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి కాలనీలో కూడా శాశ్వత డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి.ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో తల్లాడ మండల ఎంపీడీవో సురేష్ బాబు , ఎన్ఎస్పిఏఈ ఆయేషా , మండల అధికారులు, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, రమేష్, గ్రామ ప్రముఖులు ఆపతి వెంకట రామారావు, తుమ్మలపల్లి రమేష్, ఎల్లంకి సుధాకర్, ఇసనపల్లి కృష్ణార్జున్, భవాని, గొడ్ల సాల్మన్,గొడ్ల నరేష్, ఇసనుపల్లి బాబు, ఇసనపల్లి పేతురు ఎస్సీ కాలనీవాసులు, గ్రామస్తులు పాల్గన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :